టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. ఆయన కూడా చేతులెత్తేశార..!

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. ఆయన కూడా చేతులెత్తేశార..! టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. ఆయన కూడా చేతులెత్తేశార..!

Update: 2019-09-26 03:23 GMT

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే తోట త్రిమూర్తులు, వరుపుల రాజా టీడీపీకి దూరమయ్యారు. త్రిమూర్తులు వైసీపీలో చేరగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పంచకర్ల రమేశ్ బాబు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. దసరా పండగ రోజు (అక్టోబరు 8)న ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహుర్తం పెట్టుకున్నారని తెలుస్తోంది. గతకొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు రమేష్ బాబు. తోట త్రిమూర్తులుతో ఆయన మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించే దిశగా వైసీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా టీడీపీలోని బలమైన నేతలను తనవైపు తిప్పుకుంటోంది. ఇదిలావుంటే జిల్లాలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీతో టచ్ లో ఉన్నారన్న వార్త టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. అసంతృప్తి నేతల్ని బుజ్జగించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అప్పగించింది. అయితే ఆయన కూడా దీనిపై పెద్దగా దృష్టిసారించకపోవడంతో నేరుగా అధిష్టానం పెద్దలే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News