చంద్రబాబు సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న నిరసనలకు పిలువు

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత,ఏపీ ప్రతి ప్రతిపక్ష నేత చంద్రబాబు.

Update: 2020-05-19 07:24 GMT
Chandrababu Naidu (File Photo)

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత,ఏపీ ప్రతి ప్రతిపక్ష నేత చంద్రబాబు. లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యుడి సమస్యలు పట్టిచుకోకపోవడమే కాకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచి మరిన్ని కష్టాల్లోకి నెట్టేశారంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో ఇళ్లలోనే ఉండి నిరసనలు చేపట్టాలన్నారు. విద్యుత్ ఛార్జీలను దాదాపు నాలుగు రెట్లు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు.

ఇప్పటికే దేశంలోని డిస్కంలకు కేంద్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్లు రాయితీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో విద్యుత్ ధరలు పెంచడమేంటని చంద్రబాబు నిలదీశారు. విద్యుత్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు.


Tags:    

Similar News