Visakhapatnam: రుసుములు తగ్గించాలని విద్యార్థుల ఆందోళన
జిల్లా కేంద్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అపరాథ రుసుములు తగ్గించాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
విశాఖపట్నం: జిల్లా కేంద్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అపరాథ రుసుములు తగ్గించాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పెంచిన ఫీజులు తగ్గించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా అధికారులు స్పందించలేదని విద్యార్థులు వాపోయారు. ఎలాంటి నోటీసులు లేకుండా సెమిస్టర్కు రూ.400 అపరాధ రుసుము పెంచటాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఉపకులపతి, రిజిస్ట్రార్ కార్యాలయాలు ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను నిలువరించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఫీజులు తగ్గించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వీసీ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించారు.