వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో స్పీడు పెంచిన సిట్
-విచారణకు హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి నోటీసులు -ఆది నారాయణరెడ్డిని విచారణకు పిలువనున్న సిట్
మాజీ మంత్రి వై.ఎస్. వివేక హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. విచారణకు హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి సిట్ నోటీసులు జారీ చేసింది. త్వరలోల మాజీ మంత్రి , బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇవాళ డ్రైవర్ దస్తగిరితో పాటు మరికొందరిని సిట్ విచారించింది. గత మూడు రోజులుగా సిట్ వైసీపీకి చెందిన వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్. మనోహర్ రెడ్డి, టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పాటు మరికొందరిని సిట్ ప్రశ్నించింది.