సీఎం జగన్ తో భేటీ అయిన దక్షిణ కొరియా బృందం
సీఎం జగన్ను కలిసిన దక్షిణ కొరియా బృందం సీఎం జగన్ను కలిసిన దక్షిణ కొరియా బృందం
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసింది దక్షణి కొరియా బృందం. దక్షణి కొరియాలో భారత గౌరవ కాన్సులేట్ జనరల్ jung deok-min బృందం సీఎం వైయస్ జగన్ తో భేటీ అయి.. విద్య, పరిశ్రమలు, స్టీల్, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా బృందానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ స్థాయి పరిశ్రమల క్లస్టర్ లను ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి వారికి ప్రతిపాదించారు. అంతకుముందు మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆదిమలపు సురేష్ లతో దక్షణి కొరియా బృందం భేటీ పరిశ్రమలు, విద్య అంశాలపై చర్చించింది. ఏపీలో నూతన ఇండస్ట్రీ పాలసీ తయారైన తరువాత మరోసారి భేటీ అయ్యే అవకాశం కపిస్తోంది.