మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి పోలీసులు సమన్లు ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో తలెత్తిన భూ వివాదంపై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇడిమేపల్లికి చెందిన కొందరు రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు. కాగా ఇడిమేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 58–3లోని 2.41ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇతరులకు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అమ్మేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై కోర్టు ఆదేశాలతో ఏ1 ముద్దాయిగా సోమిరెడ్డిని చేర్చారు.