పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన మాత్రం కనిపించకుండా ఉన్నారు. దీంతో పచ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పెదవేగి ఎస్సై క్రాంతి ప్రియను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.