టీటీడీ పాలకమండలిలోకి ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా (ఢిల్లీ), శేఖర్రెడ్డి (చెన్నై), జనతాదళ్-ఎస్ ఎమ్మెల్యే కృపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవిందహరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై)లను నియమించింది.
ప్రస్తుతం నియమితమైన బోర్డు ఉన్నంతకాలం వీరు ప్రత్యేక ఆహ్వానితులుగా వీరు కొనసాగుతారు. దీంతో టీటీడీ బోర్డు 36 మందికి పెరిగింది. కాగా ఇప్పటికే నియమితులైన పాలకమండలి సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకుంటారు. 9-10.30 గంటల మధ్య ప్రమాణంస్వీకారం చేస్తారు. అనంతరం అన్నమయ్య భవనంలో బోర్డు తొలి సమావేశం జరగనుంది.