టీడీపీ నాయకురాలు నన్నపనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

టీడీపీ నాయకురాలు నన్నపనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు టీడీపీ నాయకురాలు నన్నపనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Update: 2019-09-12 03:35 GMT

టీడీపీ సీనియర్ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, టీడీపీ మహిళా నేత సత్యవాణిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. దళిత మహిళా ఎస్‌ఐ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ.. పెదకాకాని ఎస్‌ఐ అనురాధ వారిపై ఫిర్యాదు చేశారు. అంతకుముందు తనను కులం పేరుతో దూసించిన కారణంగా ఎస్సై అనురాధ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, నన్నపనేని రాజకుమారి లకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక చలో ఆత్మకూరు లో పాల్గొనేందుకు వెళ్లిన నన్నపనేని బృందాన్ని ఎస్సై అడ్డుకున్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన టీడీపీ మహిళా నేతలు ఎస్సైపై మండిపడటంతో వివాదం ముదిరింది. 

Tags:    

Similar News