సంక్షోభ సమయంలో జగన్ నాయకత్వ ప్రతిభ అందరికీ తెలిసింది : సజ్జల
ఏపీలో కరోనాను సమర్ధవంతంగా ఎదురుకున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.
ఏపీలో కరోనాను సమర్ధవంతంగా ఎదురుకున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి ప్రతి రోజు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం చొరవ చూపిందని, సీఎం జగన్ వారికి అన్ని వసతులు ఏర్పాట్లు చేయాలని అదేశించారని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో జగన్ వలస కార్మికులకు ఖర్చుల పై వెనుకాడలేదని అన్నారు.
ఈ సంక్షోభం వల్ల జగన్ నాయకత్వ ప్రతిభ అందరికీ తెలిసిందని, విశాఖ ఘటనలో కూడా కంపెనీలకు భయం ఉండే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. జగన్ అందరికన్నా ముందే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆకలి చావులు ఉంటాయి అని అన్నారు. జగన్ ను విమర్శించిన వారు ఇప్పుడు కిక్కురుమనకుండా ఉన్నారన్నారు.