భీమవరం: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను వచ్చే నెల 15వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఒంటిగంట వరకు ఉచితంగా అందిస్తున్నట్లు భీమవరం పట్టణ వైసీపీ నాయకులు చిగురుపాటి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బయోమెట్రిక్ విధానం లేకుండా రేషన్ వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్న అక్కడ నుంచే రేషన్ సరుకులు పొందవచ్చని తెలిపారు.