14న అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలు..

Update: 2019-09-11 01:52 GMT

ఈ నెల 14న అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్‌ లో అల్పపీడనం కొనసాగుతోందని.. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదని అధికారులు తెలిపారు. అయితే కోస్తా, రాయలసీమల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రానున్న 24 గంటల్లో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

Tags:    

Similar News