ఈ మధ్య కాలంలో విపరీతంగా పాములు జనావాసాల్లో తిరుగుతున్నాయి. వర్షాలు పడడంతో రంద్రాల్లో ఉండలేక ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. కందుకూరులోని ఓ ఇంట్లో నాగుపాము ప్రత్యక్షమైంది. టీ పెట్టేందుకు వంటగదిలోకి వెళ్లిన ఇల్లాలు బుసలు కొడుతున్న నాగుపామును చూసి జడుసుకుంది. భయంతో పరుగున బయటికి వచ్చి కుటుంబసభ్యులకు చెప్పింది. దాంతో వారు వంటగదిలోకి వెళ్లి చూడగా ప్లాట్ఫారం మీద నాగుపాము పడగ విప్పి కనిపించింది. పామును ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టేందుకు గంటలతరబడి శ్రమించాల్సి వచ్చింది. కాగా అధికారులు కూడా పాముల విషయంలో జాగ్రత్త వచించాలని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో పల్లెటూళ్లలో ఎక్కువగా పాములు ఇళ్లల్లోకి వస్తాయని చెబుతున్నారు.