చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని కోడెల నాకు ఫోన్ చేశారు : బీజేపీ నేత రఘురాం
చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని కోడెల నాకు ఫోన్ చేశారు : బీజేపీ నేత రఘురాం
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య పట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘురామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురాం.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తనకు ఎటువంటి విలువ ఇవ్వకపోవడం పట్ల కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని,చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని.. నెలరోజుల క్రితం ఆయన తనకు ఫోన్ చేసి మనసులోని ఆవేదనను తనతో పంచుకున్నారని.. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరుతానని కోడెల అంటూ.. అమిత్ షాను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారని రఘురామ్ చెప్పారు. అయితే అమిత్ షాను కలువకుండానే కోడెల మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగిస్తోందని రఘురాం పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.