Purandeswari: ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి చారిత్రక అవసరం
Purandeswari: కూటమి బలోపేతానికి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలి
Purandeswari: రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి చారిత్రక అవసరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఈ కూటమిని త్రివేణి సంగమంగా అభివర్ణించారు. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులను రాష్ట్ర, జిల్లాల ఇన్చార్జిలకు పురందేశ్వరి పరిచయం చేశారు. ఎన్నికలలో కూటమి ఏర్పాటు ఆవశ్యకత, ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను వివరించారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని.. జెండాలు వేరైనా... తమ లక్ష్యం ఒక్కటేనని పురంధేశ్వరి స్పష్టం చేశారు.