టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

Update: 2019-09-28 04:25 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేశారు పోలీసులు. సీఎం, మంత్రులు, అధికారులను దూషించారని ఆయన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు . ఇటీవల అయ్యన్న టీడీపీ నగర కార్యాలయంలో... సీఎం, మంత్రులు, అధికారులను అకారణంగా దూషించారని ఆరోపిస్తూ వైసీపీ నాయకురాలు అక్కరమాని విజయనిర్మల భర్త వెంకటరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపై మూడో పట్టణ పోలీసులు ఐపీసీ 153ఎ, 506, 503 సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీనిపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఆయనపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తుంటే.. ఇటు వైసీపీ నేతలు కూడా సీనియర్ నాయకుడైన అయ్యన్నకు ఎవరిని ఎలా గౌరవించి మాట్లాడాలో తెలియదా అంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. 

Tags:    

Similar News