బిగ్ బ్రేకింగ్ : పోలవరం రివర్స్ టెండరింగ్ లో ఫలించిన సీఎం జగన్ ప్రయత్నం

బిగ్ బ్రేకింగ్ : పోలవరం రివర్స్ టెండరింగ్ లో ఫలించిన సీఎం జగన్ ప్రయత్నం

Update: 2019-09-20 13:23 GMT

రివర్స్ టెండరింగ్ లో సీఎం వైఎస్ జగన్ ప్రయత్నం ఫలించింది. పోలవరం రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వ సొమ్ము స్వల్పంగా ఆదా అయింది. పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజికి టెండర్ ఖరారైంది. 15.6 లెస్ కు టెండర్ వేసింది మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ. గతంలో ఇదే సంస్థ 4.8 శాతం ఎక్కువకు టెండర్ వేసింది. గతంలో ఈ పనులను రూ. 292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్ఫ్రా దక్కించుకుంది. అయితే రివర్స్ టెండరింగ్ లో రూ. 231.47 కోట్లకు ఇదే పనులను దక్కించుకుంది. అయితే ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువ రూ. 274.55 కోట్లుగా ఉంచింది. దాంతో ప్రభుత్వానికి రూ.42.08 కోట్లు ఆదా అయింది. ఈ పనులను దక్కించుకునేందుకు మొత్తం 6 సంస్థలు పోటీ పడ్డాయి. ఇక ఈ నెల 23న పోలవరం హెడ్ వర్క్స్ , స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులకు రివర్స్ టెండరింగ్ జరగనుంది. 

Tags:    

Similar News