Rampachodavaram: సామజిక దూరం పాటించకపోతే ప్రమాదమే
కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామాజిక దూరం పాటించకపోతే ప్రమాదం తప్పదని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య అన్నా రు.
రంపచోడవరం: కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామాజిక దూరం పాటించకపోతే ప్రమాదం తప్పదని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య అన్నా రు. రంపచోడవరంలో అంబేద్కర్ సెంటర్లో కూరగాయల మార్కెట్ ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దుకాణాల వద్ద గుంపులు, గుంపు లుగా ఉండనివ్వద్దని ఆయన పోలీసులను, అధికారులను ఆదేశించారు. తక్షణమే మార్కెట్ ను విశాలమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్చాలని ఆయన ఆదేశించారు.