Peddireddy: పొత్తులపై భయపడేది లేదు, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది

Peddireddy: వచ్చే ఎన్నికల్లో వైసీపీ 150స్థానాల్లో విజయం సాధిస్తుంది

Update: 2023-05-14 13:21 GMT

Peddireddy: పొత్తులపై భయపడేది లేదు, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది 

Peddireddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతపురం రూరల్ నాగిరెడ్డిపల్లిలో వైసీపీ మండల కన్వీనర్లకు వైఎస్సార్ పీపుల్స్ సర్వేలో జిల్లాలో మొదటి స్థానంలో గెలుపొందిన వారిని మంత్రి సన్మానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ- జనసేన పొత్తులు పెట్టుకుంటే వైసీపీ భయపడదని.. రాజకీయంగా తాము టీడీపీలాగా ఊతకర్ర పట్టుకుని నడిచే పరిస్ధితుల్లో లేమని మంత్రి చురకలంటించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే ముందు ..ఆయన గెలుస్తారో లేదో ఆలోచించుకోవాలని పెద్దిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News