మరోసారి సింప్లిసిటి చాటుకున్న జనసేనాని

Update: 2019-12-13 07:50 GMT
పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. అలసటతో ఓ అరుగుపై పడుకొని విశ్రాంతి తీసుకొన్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేనాని గురువారం కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేశారు. సాయంత్రం దీక్ష ముగిసిన తర్వాత రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి బయల్దేరారు. విమానాశ్రయానికి చేరుకొనేటప్పుడు విమానం ఆలస్యం అని సమాచారం అందిడంతో.. మార్గమధ్యమంలో ఓ జనసేన కార్యకర్త ఇంటి దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.

ఇంటి అరుగుపై పడుకొని విశ్రాంతి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. తల కింద దిండు తప్ప.. ఎలాంటి బెడ్‌షీట్, చాప లేకుండానే ఫ్లోర్‌పై పడుకున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆయన అభిమానులు. 

Full View

Tags:    

Similar News