AP News: ఏపీలో ప్రచారాలకు సిద్ధమవుతున్న పార్టీలు

AP News: కర్నూలు జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం జగన్ టూర్

Update: 2024-03-25 13:13 GMT

AP News: ఏపీలో ప్రచారాలకు సిద్ధమవుతున్న పార్టీలు

AP News: ఏపీలో పార్టీలు ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. మేము సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర.. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి పవన్‌ వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారు.

వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు రోజులపాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇప్పటికే లక్షల మందితో నిర్వహించిన సిద్ధం సభల సక్సెస్‌తో మంచి వుత్సాహం మీద ఉన్న ఆ పార్టీ క్యాడర్...తాజాగా ఫ్యాన్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేము సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేసెందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలు క్యాడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఊపును కొనసాగించేందుకు వైసీపీ అధినేత మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలను మినహాయించి మిగిలిన నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను వైసీపీ ముఖ్య నేతలు సిద్ధం చేశారు. గతంలో ఓదార్పు యాత్ర జరిగిన తీరును తలపించేలా మేమంతా సిద్ధం యాత్ర ఉండబోతుందని స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News