వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. దీంతో నలుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న సంఘటన హైదరాబాద్ పంజాగుట్టలో చోటుచేసుకుంది. పంజాగుట్టకు సమీపంలో ఉండే ఎల్లారెడ్డిగూడలోని శ్రీతి నిలయం అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో వ్యభిచారం జరుగుతుందని పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందింది. దాంతో క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నిర్వాహకులు భానుప్రకాష్, పవన్లతో పాటు నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు కుమార్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతులను రెస్క్యూ హోంకు తరలించి.. నిర్వాహకులను రిమాండ్ తరలించారు.