CM Jagan: కొనసాగుతున్న సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

CM Jagan: సాయంత్రం కాకినాడ అచ్చంపేట జక్షన్‌లో బహిరంగ సభ

Update: 2024-04-19 03:57 GMT

CM Jagan: కొనసాగుతున్న సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

CM Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇవాళ 18వ రోజు కాకినాడ జిల్లా ఎస్.టీ రాజాపురం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభంకానుంది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్ తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేస్తారు.

Tags:    

Similar News