సోమిరెడ్డికి ఝలక్.. వైసీపీలో చేరిన కీలకనేత..

సోమిరెడ్డికి ఝలక్.. వైసీపీలో చేరిన కీలకనేత.. సోమిరెడ్డికి ఝలక్.. వైసీపీలో చేరిన కీలకనేత..

Update: 2019-09-21 16:03 GMT

ఎన్నికల అనంతరం టీడీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే నలుగురు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీనుంచి చేజారిపోయారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ కీలకనేత. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కోడూరు కమలాకర్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. వాస్తవానికి ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన చేరిక ఉండాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో జిల్లా ముఖ్యనేతల సమక్షంలోనే చేరాల్సి వచ్చింది. 

Tags:    

Similar News