ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్

Update: 2019-09-08 10:31 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నేతలనుద్దేశించి మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. 'రావాలి సీబీఐ.. కావాలి సీబీఐ.. అన్నారు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారో! బాబాయ్ హత్య కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన పెద్ద మనుషులు ఇప్పుడు వారే అధికారంలో ఉన్నా సీబీఐ వద్దు అని ఎందుకు అంటున్నారు? హత్య కేసులో అనుమానితుల ఆత్మహత్యల వెనుక రహస్యం ఏంటి? కోడికత్తి వెనుక మహాకుట్ర ఉంది, సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? నిందితుడు జైల్లోనే ప్రాణహాని ఉంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? సీబీఐకి కేసు అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సివస్తుందని భయమా?' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News