Andhra Pradesh: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్

Andhra Pradesh: తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాం- పెద్దిరెడ్డి

Update: 2021-04-11 07:37 GMT

మినిస్టర్ పెద్దిరెడ్డి & చంద్రబాబు


Andhra Pradesh: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోతే తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని... టీడీపీ ఓడిపోతే ముగ్గురు ఎంపీలతో సహా రఘురామకృష్ణంరాజు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తిరుపతి బైపోల్‌ను రెఫరెండంగా తీసుకుంటున్నామన్న ఆయన.. ఒంటరిగా పోటీ చేసే సంస్కృతి టీడీపీకి లేదన్నారు. ఆలయాల్లో విగ్రహాలు వారే పగలగొట్టి టీడీపీ రాజకీయాలు చేస్తోందన్న పెద్దిరెడ్డి. 20 నెలలో ప్రభుత్వం చేసిన ప్రజాహిత కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు.

Tags:    

Similar News