Audimulapu Suresh: సీఎం జగన్ చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది

* మూడు దశాబ్దాలు ఆయనే సీఎంగా ఉంటారు- మంత్రి ఆదిమూలపు సురేష్ * విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పవన్ బీజేపీని నిలదీయాలి- మంత్రి ఆదిమూలపు

Update: 2021-11-06 08:49 GMT

ఆదిమూలపు సురేష్ (ఫైల్ ఫోటో)

Audimulapu Suresh: సీఎం జగన్ చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. మూడు దశాబ్దాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసి హామీలను నెరవేరుస్తున్నామన్నారు.

ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామని, మొదటి నుంచి రాష్ట్ర ప్రయోజనాలు కోసం వైసీపీ బలంగా పోరాడుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ బీజేపీని నిలదీయాలన్నారు. పవన్ బీజేపీతో దోస్తీ చేసి డ్రామాలు ఆడుతున్నారంటున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Tags:    

Similar News