Vande Bharat Mission: 114 మంది తెలుగు ప్రజలతో విశాఖ చేరుకున్న కువైట్ విమానం
జీవనోపాధి కోసం ఇతర దేశాల్లో ఉంటున్న వారిని రప్పించేందుకు కేంద్రం తీసుకున్న చొరవ సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి ఏపీకి రెండు విమానాల్లో విశాఖపట్నం తరలించగా, బుధవారం రాత్రి మరో విమానం కువైట్ నుంచి 114 మంది తెలుగు వాళ్లను తీసుకొచ్చింది.
కువైట్ ఎయిర్ లైన్స్ (KU-1609) ఈరోజు రాత్రి (KWT-VTZ) కువైట్ ఎయిర్లైన్స్ విమానంలో 9: 30 నిమిషాలకు 114 మంది తెలుగువారు విశాఖ చేరుకున్నారు. వీరితో పాటు వీరు తెచ్చుకున్న సామానులకు విశాఖ విమాన శ్రయం వద్ద సిబ్బంది శానిటైజ్ చేశారు.
వీరందరికీ (screening test)ఇమ్మిగ్రేషన్కస్టమ్స్ చెకింగ్ చేయటానికి సుమారు ఒక గంట సమయం పట్టింది. కువైట్ నుండి విశాఖ చేరుకున్న ప్రయాణికులను విశాఖ పోర్టు సీతారామ కళ్యాణ మండపం తీసుకొని వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరం వారివారి జిల్లాలకు ప్రభుత్వ మరియు పెయిడ్ కోరం ట్రైన్ కు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో తరలించారు.
అయితే భవిషత్తులో వీరి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపే అవకాశం లేకపోవడంతో వీరికి స్వగ్రామాల్లోనే జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం చొరవతో ఆయా ప్రాంతాల్లో వనరుల సౌలభ్యం బట్టి ఏ విధంగా జీవనోపాధి కల్పించాలనే దానిపై లెక్కలు వేస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే భవిషత్తులో జీవనోపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు.