మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఆయనను వేధించి ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కొందరు టీడీపీ నేతలు వారించే ప్రయత్నం చేసినా వారు ససేమీరా అంటున్నట్టు సమాచారం. కాగా కోడెలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంగళవారం జగన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన కుటుంబం మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈరోజు (బుధవారం) నరసరావుపేటలో కోడెల అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు.