పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారికి టీటీడీ శుభవార్త.. కళ్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభం

TTD : పేదవారికి అండగా ఆగస్ట్ 7న కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నాం

Update: 2022-06-03 06:54 GMT

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారికి టీటీడీ శుభవార్త.. కళ్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభం

TTD: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు అండగా టీటీడీ ఆధ్వర్యంలో ఆగష్టు 7న కళ్యాణమస్తు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గతంతో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు ద్వారా ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున జరిగేవని, ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని వివరించారు.

పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై, ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా టీటీడీ వివాహాలు జరిపించనుందని చెప్పారు. అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 

Tags:    

Similar News