ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా పి.లక్ష్మణ్‌రెడ్డి

Update: 2019-09-07 05:02 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇటీవల లోకాయుక్త నియామక ఫైలుపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌.. లక్ష్మణ్‌రెడ్డి నియామకానికి ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలనే లక్ష్యంగా ముందడుగేస్తున్న జగన్.. అందులో భాగంగా నిజాయితీ, వివాదరహితుడిగా పేరున్న లక్ష్మణ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 

Tags:    

Similar News