ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయనచేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐదేళ్ల పాటు లక్ష్మణ్రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్డ్ అయిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ని.. ఏపీ ప్రభుత్వం లోకాయుక్తగా నాలుగు రోజులకిందట నియమించిన సంగతి తెలిసిందే.