జగన్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం.. శాశ్వత..

జగన్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం.. శాశ్వత.. జగన్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం.. శాశ్వత..

Update: 2019-09-12 01:19 GMT

ఏపీలో జగన్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇదివరకే బీసీ కమీషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో చట్టం చేసిన ప్రభుత్వం.. తొలి చైర్మన్ గా రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ అంబటి శంకర నారాయణను నియమించాలని నిర్ణయించింది. ఆయన నియమితులైతే మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగారి ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జస్టిస్‌ శంకర నారాయణ నియామకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. 

Tags:    

Similar News