సినీనటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జయసుధ కలిశారు. తన కుమారుడి వివాహానికి సీఎంను రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం సీఎంతో కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు.