జనసేన కార్యకర్తలకు అధినేత పవన్ క్లాస్ తీసుకున్నారు. జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలన్నారు. మీరు క్రమ శిక్షణలో లేకపోవడం వల్లే తాను ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. కార్యకర్తకలు క్రమశిక్షణగాఉండి ఉంటే జనసేన గెలిచేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఆదివారం పవన్ పర్యటించారు. రైతులతో భేటీ, రైతు సదస్సుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా వెలగతోడులో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి కష్టాలు తెలుసుకున్నారు.