Pawan Kalyan: పిఠాపురం చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి జనసేనాని

Update: 2024-04-01 10:13 GMT

Pawan Kalyan: పిఠాపురం చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురానికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకున్న జనసేనాని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గొల్లప్రోలుకు వెళ్లారు. ఆ తర్వాత రోడ్డుమార్గాన పిఠాపురం గోకుల్‌ గ్రాండ్‌ హోటల్‌కు చేరుకున్నారు సేనాని. ఉదయం 11 గంటలకే పవన్‌ పిఠాపురం చేరుకోవాల్సి ఉంది. అయితే.. కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యమైంది. మరోవైపు.. పవన్‌ రాక కోసం గోకుల్‌ గ్రాండ్‌ హోటల్‌ వద్ద ఎదురుచూస్తున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు.. పవన్‌ను చూడగానే.. ఆయనను కలిసేందుకు ఎగబడ్డారు. ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

Tags:    

Similar News