Janasena: జనసేన అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

Janasena: జనసేన అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల విడుదలైంది

Update: 2024-03-24 16:15 GMT

  Janasena: జనసేన అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

Janasena: జనసేన అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల విడుదలైంది. ఇప్పటికే ఏడుగురి అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని..తాజాగా 11 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో పాత, కొత్త అభ్యర్థులతో కలిపి మొత్తం 18 మందితో లిస్ట్ రిలీజ్ చేశారు. పిఠాపురం- పవన్ కల్యాణ్, నెల్లిమర్ల- లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్- పంతం నానాజీ, రాజానగరం టికెట్ బత్తుల బలరామకృష్ణకు కేటాయించారు. ఇక తెనాలి- నాదెండ్ల మనోహర్, నిడదవోలు- కందుల దుర్గేష్ పెందుర్తి- పంచకర్ల రమేష్‌బాబు, యలమంచిలి- సుందరపు విజయ్‌కుమార్, పి.గన్నవరం- గిడ్డి సత్యనారాయణ, రాజోలు- దేవ వరప్రసాద్ తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు బరిలోకి దిగనున్నారు. ఇంకా మూడు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.. అవనిగడ్డ, పాలకొండ, వైజాగ్ సౌత్ టికెట్లను కన్ఫామ్ చేయాల్సి ఉంది. మరోవైపు రెండు లోక్‌సభ స్థానాలకు కూడా అఫీషియల్‌గా అభ్యర్థులను ప్రకటించారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్, మచిలీపట్నం నుంచి బాలశౌరి బరిలోకి దిగనున్నారు.

Tags:    

Similar News