Jaggampeta: జనసైనికుల అసమ్మతి సెగలు.. రెండు రోజుల్లో అధిష్టానం నుంచి పిలుపు రాకపోతే

Jaggampeta: దీక్షకు దిగిన జనసైనికుడు పాఠంశెట్టి సూర్యచంద్రం

Update: 2024-02-26 14:07 GMT

Jaggampeta: జనసైనికుల అసమ్మతి సెగలు.. రెండు రోజుల్లో అధిష్టానం నుంచి పిలుపు రాకపోతే

Jaggampeta: జగ్గంపేటలో జనసైనికులు అసమ్మతి రాగం అందుకున్నారు. అచ్యుతాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తీరుపై జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేటకు తమ నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించపోతే.. జగ్గంపేటలో జనసేన ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు జనసేన కార్యకర్తలు. కార్యకర్తల మనోభావాలను అధిష్టానం పట్టించుకోవడం లేదని.. జనసేన కార్యకర్త పాఠంశెట్టి సూర్యచంద్రం ఆవేదన వ్యక్తం చేశారు. మరో 48 గంటల్లో పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే.. పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Tags:    

Similar News