ముక్కంటి సేవలో ఇస్రో డైరెక్టర్ రాజరాజన్

ఇస్రో డైరెక్టర్ రాజ రాజన్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు.

Update: 2019-09-11 13:46 GMT

శ్రీకాళహస్తి: జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఇస్రో డైరెక్టర్ రాజరాజన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికి అభిషేక పూజలతో పాటు,స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వీరికి గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులచే ఆశీర్వాదం తో పాటు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్, పిఆర్ఓ హరి యాదవ్, వేదపండితులు మారుతి శర్మ, శివ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News