ఎన్నిక విషయంలో కరణం బలరామ్కు హైకోర్టు నోటీసులు
ఎన్నిక విషయంలో కరణం బలరామ్కు హైకోర్టు నోటీసులు ఎన్నిక విషయంలో కరణం బలరామ్కు హైకోర్టు నోటీసులు
ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కరణం బలరామ్ ఎన్నిక చెల్లదంటూ.. హైకోర్టులో సవాలు చేశారు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్.ఈ క్రమంలో పిటిషన్ పై స్పందించిన హైకోర్టు కరణం బలరామ్తోపాటు రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కాగా చీరాల ఎమ్మెల్యేగా ఎన్నికైన కరణం బలరాం ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచిపెట్టారని, దీనిపై ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని, అందువల్ల బలరామ్ ఎన్నికను రద్దు చేసి తనను ఎన్నిౖకైనట్లు ప్రకటించాలని ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ ను దాఖలు చేశారు.