మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టు సంచలన తీర్పు

Update: 2020-12-30 10:56 GMT

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐఏఎస్‌ ప్రవీణ్‌పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అసహనం వ్యక్తంచేసిన హైకోర్టు. కోర్టు ధిక్కారం కింద కేసు నమోదుచేసి క్రిమినల్ ప్రాసిక్యూషన్‌‌కు చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయ ప్రక్రియలో ప్రభుత్వ జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిక్విజల్ పిటిషన్‌‌ను తోసిపుచ్చింది. అలాగే, న్యాయస్థానం చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా పిటిషన్‌ వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News