Chittoor: చిత్తురు జిల్లా కుప్పంలో భారీగా మద్యం పట్టివేత

Chittoor: రూ.6 లక్షల విలువైన మద్యం పట్టివేత

Update: 2024-03-25 08:46 GMT

Chittoor: చిత్తురు జిల్లా కుప్పంలో భారీగా మద్యం పట్టివేత

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల వేళ బారీగా మద్యం పట్టుబడింది. కర్ణాటక నుంచి గుడుపల్లి మండలం సోడిగానిపల్లి కి తరలిస్తున్న భారీ మధ్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబాలుపెట్టేందుకు ఈ మధ్యం తరలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 6 లక్షల రూపాయల విలువైన మధ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నటక నుంచి అక్రమంగా తీసుకువచ్చిన మద్యాన్ని ఎన్నికల సందర్భంగా పంచడానికి తీసుకువచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడింది. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కారుని గుర్తించారు. ఇద్దరి నిందితులను అరెస్ట్ చేశారు. కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News