మళ్ళీ పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ

Update: 2019-09-09 02:02 GMT

ఎగువన కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రతిరోజు శ్రీశైలం డ్యాంకు లక్షా 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దీంతో 98 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. దాంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఆ తరువాత పులిచింతల నుంచి 36 వేల క్యూసెక్కులు నీరు ప్రకాశం బ్యారేజీకి వెళుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 15 గేట్లు ఒక అడుగు మేర ఎత్తారు. దాదాపు 11వేల క్యూసెక్కుల నీటని సముద్రంలోకి విడుదల చేశారు.

Tags:    

Similar News