Kakinada: కాకినాడ జిల్లాలో భారీ మొత్తంలో బంగారం సీజ్
Kakinada: పెద్దాపురంలో తనిఖీల్లో పట్టుబడిన 8 కోట్ల విలువ చేసే గోల్డ్
Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుపడింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బివిసీ లాజిస్టిక్స్ కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా సుమారు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే 8 కిలోల బంగారం, 46 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురంలోని నగల దుకాణంలో ఆభరణలను కాకినాడు మీదుగా విశాఖకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. వాహనాన్ని పెద్దాపురం ఆర్వో కార్యాలయానికి తరలించారు.