బోటు ప్రమాదం: మరో 5 మృతదేహాల లభ్యం
బోటు ప్రమాదం: మరో 5 మృతదేహాల లభ్యం బోటు ప్రమాదం: మరో 5 మృతదేహాల లభ్యం
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మునిగిపోయిన మరో ఐదుగురు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు 33 మృతదేహాలను వెలికితీశారని మరో 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే గోదావరిలో 315 అడుగుల లోతులో ఉన్న లాంచీని వెలికి తీసేందుకు ఎన్టీఆర్ఎఫ్, నేవీ, అగ్నిమాపక బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయన్నారు. బోటు వెలికితీసేందుకు ఉత్తరాఖండ్కు చెందిన సైడ్ స్కాన్ సోనర్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు.