గన్నేరు పప్పు తిని ప్రాణం తీసుకోవడానికి ట్రై చేశాడు.. చివరకు..

Update: 2019-09-09 07:26 GMT

ఓ యువకుడు చనిపోవాలనుకొని గన్నేరుపప్పు తిన్నాడు. తింటున్నప్పుడు సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితులకు పంపించాడు. అందులో తాను చనిపోతున్నట్టు స్నేహితులకు తెలియజేశాడు. అయితే సకాలంలో స్పందించిన స్నేహితులు అతన్నికాపాడారు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దాంతో బొబ్బిలికి వచ్చి అక్కడ ఓ లాడ్జ్‌లో అద్దెకు దిగాడు.

గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పప్పు తింటూ స్నేహితులకు సెల్ఫీ వీడియో పంపించాడు. అది చూసిన స్నేహితులు, వెంటనే బొబ్బిలి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకున్ని పట్టుకొని హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడటంతో అతన్ని ఇంటికి పంపించారు పోలీసులు. కాగా అతను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణం కుటుంబసమస్యలే అని తెలుస్తోంది. 

Tags:    

Similar News