Yellamanchili: పేదలకు నిత్యావసర సరుకులు విరాళం
ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను తమవంతు సహాయంగా అదుకోనేందుకు పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకు రావటం పట్ల హరం వ్యక్తం అవుతుంది.
యలమంచిలి: ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను తమవంతు సహాయంగా అదుకోనేందుకు పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకు రావటం పట్ల హరం వ్యక్తం అవుతుంది. అడ్డ రోడ్డుకు చెందిన బంగారం వ్యాపారి లంక వెంకటరమణ తనవంతు సహయంగా పేదలకు బియ్యం, పప్పు, చింతపండు, ఎండుమిర్చి వంటి నిత్య అవసరాలను ఆదివారం తిమ్మాపురం ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు వంగలపూడి గోవిందు, బోండా దివాణం, నారయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.