Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,776 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-09-04 13:58 GMT

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,776 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59,919 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,776 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 12,334 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 08, ప్రకాశం 09, గుంటూరు 08, కడప 08, నెల్లూరు 08, తూర్పుగోదావరి 06, పశ్చిమగోదావరి 06, విశాఖపట్నం 06, కృష్ణా 05, శ్రీకాకుళం 04, అనంతపురం 03, కర్నూలు 02, విజయనగరం జిల్లాలో 02 చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 4,76,506. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,276. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,70,163కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,02,067 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 39,65,694 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 64,305, కర్నూల్ జిల్లా 47,573, అనంతపురం జిల్లా 43,998, పచ్చిమ గోదావరి జిల్లా 40,699, చిత్తూర్ జిల్లా 40,696, విశాఖపట్నం జిల్లా 39,449, గుంటూరు జిల్లాలో 38,791, నెల్లూరు లో 34,933 కేసులు నమోదయ్యాయి.




Tags:    

Similar News