విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబకు కోర్టు ధిక్కరణ నోటీసులు

EO Bramaramba: విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

Update: 2023-01-04 09:23 GMT

విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబకు కోర్టు ధిక్కరణ నోటీసులు

EO Bramaramba: విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కోర్టులో హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. ఉద్యోగుల రెగ్యులరైజ్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు పలువురు దుర్గగుడి ఉద్యోగులు. జూనియర్లను రెగ్యులరైజ్‌ చేసి.. తమను పక్కన పెట్టారని కోర్టుకు తెలిపారు. అయితే.. ఈ విషయంలో మూడు సార్లు ఈవోను కోర్టు వివరణ కోరగా.. స్పందించకపోవడంతో కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు అందాయి.

Tags:    

Similar News