విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Update: 2019-09-28 05:02 GMT

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు వెళ్లారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో విశాఖ వెళ్లారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బలిరెడ్డి సత్యారావు భౌతికకాయానికి ముఖ్యమంత్రి నివాళులు అర్పించనున్నారు.అనంతరం బలిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

కాగా 1989లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బలిరెడ్డి.. రాష్ట్ర మధ్యతరహా నీటిపారుదలశాఖామంత్రిగా పనిచేశారు .2012 నుంచి వైఎస్సార్‌ సీపీలో సీనియర్‌ నాయకుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ టిక్కెట్ రాకపోవడంతో కరణం ధర్మశ్రీకి సపోర్ట్ చేశారు. 

Tags:    

Similar News